ప్రతీ ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2023-01-24T00:51:11+05:30 IST
కంటి వెలుగులో ప్రతి ఒక్కరికి క్షుణంగా కంటి పరీక్షలు నిర్వహించాలని డీ ఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ తెలిపారు.
తాడ్వాయి, జనవరి 23: కంటి వెలుగులో ప్రతి ఒక్కరికి క్షుణంగా కంటి పరీక్షలు నిర్వహించాలని డీ ఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ తెలిపారు. తాడ్వాయిలో కంటివెలుగు శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది వేణుగోపాల్, మండల వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
15,648 మందికి పరీక్షలు
కామారెడ్డిటౌన్, జనవరి 23: జిల్లాలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో మొత్తం 15,648 మందికి కంటి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో ల క్ష్మణ్సింగ్ తెలిపారు. గడిచిన నాలుగు రోజుల్లో 138 క్యాంపులు నిర్వహించగా అందులో 3,524 మందికి క ళ్లద్దాలు అందించామని తెలిపారు.సోమవారం 5,150 మందికి పరీక్షలు నిర్వహించడంతో పాటు 1504 మందికి కళ్లద్దాలు పంపిణీచేసినట్లు వివరించారు.