మట్టపల్లి క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2023-02-02T00:18:13+05:30 IST
జడ్పీ చైర్పర్సన్ దంపతులను సన్మానిస్తున్న నాయకులు
జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక
మఠంపల్లి, ఫిబ్రవరి 1: భక్తుల కోర్కెలు తీర్చే మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగంధర్ అన్నారు. మట్టపల్లి క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా ఆమె బుధవారం దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తొలుత ఆలయ పాలకులు ఆమెకు స్వాగతం పలకగా, వేదపండితులు జడ్పీ చైర్మన్ దంపతులకు ఆశీర్వచనం చేసి పట్టుశాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ విశిష్టత, పులిచింతల ప్రాజెక్టు ముంపు నుంచి ఆలయాన్ని కాపాడేలా చర్యలు తీసుకుంటున్న వారికి ఆలయ పాలకులు చెన్నూరి విజయ్కుమార్, మట్టపల్లిరావు వివరించారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్ దంపతులకు బీఆర్ఎస్ మండల నాయకులు ఘన స్వాగతం ఫలికారు. కార్యక్రమంలో ఎంపీపీ ముడావత్ పార్వతికొండానాయక్, జడ్పీటీసీ బానోతుజగన్నాయక్, మట్టపల్లి సర్పంచ్ దాసరి విజయలక్ష్మీ వెంకటరమణ, ఎంపీడీవో మామిడి జానకిరాములు, ఎంపీవో ఆంజనేయులు, అయ్యప్ప, కంబాల మురళి, మణీ, ఇమ్మానేయులు, తదితరులు పాల్గొన్నారు.