కమనీయం అర్వపల్లి నృసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2023-02-07T00:48:23+05:30 IST

అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మినర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవార్ల కల్యాణమహోత్సవాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు.

కమనీయం అర్వపల్లి నృసింహుడి కల్యాణం
హాజరైన భక్తులు, కల్యాణోత్సవంలో మాంగల్యధారణ ఘట్టం

అర్వపల్లి, ఫిబ్రవరి 6 : అర్వపల్లి శ్రీయోగానందలక్ష్మినర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవార్ల కల్యాణమహోత్సవాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య వేదమంత్రాలతో ఈ తంతువును వేదపండితులు జరిపించారు. దేవాలయ సింహాద్వారం నుంచి స్వామివారి ఊరేగింపులో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, దేవాలయ ఈవో శ్రీనివా్‌సరెడ్డి, దేవాలయ చైర్మన చిల్లంచర్ల విద్యాసాగర్‌, సర్పంచ బైరబోయిన సునీతారామలింగయ్య, ఎంపీటీసీ కనుకు పద్మశ్రీనివా్‌స పల్లకి మోస్తూ, కోలాటాలు ఆడుతూ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు రాంబాబు అయ్యంగార్‌, ఆనంద్‌ దీక్షితులు, పవన అయ్యంగార్‌, ఆనంద్‌ అయ్యంగార్‌, ఉపసర్పంచ పులిచర్ల ప్రభాకర్‌, ప్రభు, కడారి నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:48:27+05:30 IST