గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-01-25T00:54:52+05:30 IST

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. మరో రోజు మాత్రమే సమయం ఉండటంతో అన్ని శాఖల అధికారులు కూడా వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
వేడుకలకు సిద్ధమైన కలెక్టరేట్‌

యాదాద్రి, భువనగిరి అర్బన్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. మరో రోజు మాత్రమే సమయం ఉండటంతో అన్ని శాఖల అధికారులు కూడా వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని రాయిగిరిలో నిర్మించిన నూతన కలెక్టరేట్‌లో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవం జరగనుంది. ఈమేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించే స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు మంగళవారం కలెక్టరేట్‌ ఆవరణలో స్థలాన్ని పరిశీలించారు. జాతీయజెండాను కలెక్టర్‌ ఆవిష్కరించేందుకు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ముందు మూడు రంగుల దిమ్మెను ఏర్పాటుచేశారు. పోలీసుల గౌరవ వందనంతోపాటు కవాతు నిర్వహించేందుకు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కలెక్టరేట్‌ ఆవరణలో ప్రాక్టీస్‌ చేయనున్నారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌ భవనానికి ఏర్పాటు చేసిన బోర్డును సరిచేశారు.

Updated Date - 2023-01-25T00:54:53+05:30 IST