అంబేడ్కర్‌ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు

ABN , First Publish Date - 2023-02-04T23:34:23+05:30 IST

రాయపోల్‌, ఫిబ్రవరి 4: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాల ఏర్పాటు కోసం ఎవరి వద్ద అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు
బేగంపేటలో అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్టకు పిల్లర్‌ ఏర్పాటుచేసిన ప్రజాసంఘాలు

డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

రాయపోల్‌, ఫిబ్రవరి 4: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహాల ఏర్పాటు కోసం ఎవరి వద్ద అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. రాయపోల్‌ మండలం బేగంపేటలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే సర్పంచ్‌, పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసి నిర్మిస్తున్న గద్దెను తొలగించడంతో శనివారం దళిత బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదే స్థానంలో పునర్నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటుచేసే క్రమంలో ఎవరైనా అడ్డువస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు దేవేందర్‌, ఉపసర్పంచ్‌ తూర్పు లక్ష్మణ్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి రామచంద్రం, సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌ నాస్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-04T23:34:34+05:30 IST