బీజేపీ ఆధ్వర్యంలో కార్నర్‌ సమావేశాలు

ABN , First Publish Date - 2023-02-06T23:56:20+05:30 IST

ఈ నెల 10 నుంచి 25 వరకు నిర్వహణ సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల బీజేపీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌

బీజేపీ ఆధ్వర్యంలో కార్నర్‌ సమావేశాలు
మెదక్‌లో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 6: పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 7, 8, 9 తేదీల్లో ప్రతీ మండలంలో శక్తి కేంద్రం ఇన్‌చార్జిల సమావేశాలు, 10 నుంచి 25వరకు కార్నర్‌ సమావేశాలు నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మెదక్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం బీజేపీ శ్రేణులతో మెదక్‌, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు వేర్వేరుగా మాట్లాడారు. రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వ ఆకృత్యాలను, ఆగడాలను, వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. మెదక్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా నాయకులు లోకేష్‌, రాము, నాగరాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సతీ్‌షపటేల్‌ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్‌ రాములు, కో కన్వీనర్‌ సత్యనారాయణ, శక్తి కేంద్ర సభల నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ జగన్‌, పట్టణ అధ్యక్షుడు రవిశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:56:21+05:30 IST