TS News: బీ.ఫార్మసి విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతం

ABN , First Publish Date - 2023-01-24T13:35:16+05:30 IST

గీతం యూనివర్సిటీ బీ.ఫార్మసి విద్యార్థిని రోషిణి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది.

TS News: బీ.ఫార్మసి విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతం

సంగారెడ్డి: గీతం యూనివర్సిటీ బీ.ఫార్మసి విద్యార్థిని రోషిణి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. విద్యార్థిని సేఫ్‌గా తన బాబాయ్ ఇంటికి చేరుకుంది. విద్యార్థిని డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. డిప్రెషన్‌లోనే తండ్రికి ఫోన్ చేసినట్టు పోలీసులు, బంధువులు భావిస్తున్నారు. ఈ నెల 16న హైదర్‌నగర్‌లోని తన బాబాయి ఇంటి నుంచి కాలేజీకని వచ్చిన విద్యార్థిని... ఆ తరువాత 22 నాడు తండ్రికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీనిపై తండ్రి పటాన్‌‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు విద్యార్థిని సురక్షితంగా ఇంటికి తిరిగి రావడంతో బంధువులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2023-01-24T13:35:17+05:30 IST