నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-02-06T23:59:39+05:30 IST
వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో పేదల ధర్నా
వెల్దుర్తి/మాసాయిపేట, ఫిబ్రవరి 6: నిరుపేదలందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. వారి ఆధ్వర్యంలో వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం పేదలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, జిల్లా కార్యదర్శి మల్లేశం, సీఐటీయూ మండల కార్యదర్శి పోచయ్య, నాయకులు శంకర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మాసాయిపేట తహసీల్దార్ మాలతికి వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, సీఐటీయూ నాయకులు పోచయ్య, శంకర్, నరేందర్ మండలంలోని పేదలు ఉన్నారు.