అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు

ABN , First Publish Date - 2023-02-01T23:21:40+05:30 IST

శివస్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికా దని గురుస్వామి జగదీశ్‌ అన్నారు.

అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు

- మరికల్‌లో శివస్వాముల రాస్తారోకో

- ఎస్‌ఐకి వినతి పత్రం అందజేత

మరికల్‌, ఫిబ్రవరి 1: శివస్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికా దని గురుస్వామి జగదీశ్‌ అన్నారు. తాండూర్‌ నియోజకవర్గంలోని యాలాల్‌ మండలం దేవనూర్‌ గ్రామంలో శివస్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేయ డాన్ని నిరసిస్తూ బుధవారం మరికల్‌లో ప్రధాన రోడ్డుపై శివస్వాములు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా శివస్వాములు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దాదాపు గంటపాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం ఎస్‌ఐ అశోక్‌ బాబుకు శివస్వాములు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో గురు స్వామి జగదీశ్‌, శివస్వాములు నర్సిములు, అనిల్‌కుమార్‌ రెడ్డి, కూసూర్‌ రవి, కుమ్మరి రాజు, స్వాములు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:21:41+05:30 IST