హాస్టల్ వర్కర్ల ధర్నా
ABN , First Publish Date - 2023-01-24T22:42:50+05:30 IST
గిరిజన హాస్టల్స్లో అవుట్సోర్సింగ్, డైలీవేజ్ కార్మికులకు తమకు తక్షణమే 39 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముం దు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
భద్రాచలం, జనవరి 24: గిరిజన హాస్టల్స్లో అవుట్సోర్సింగ్, డైలీవేజ్ కార్మికులకు తమకు తక్షణమే 39 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముం దు సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల బడ్జెట్ రూ.9 కోట్ల చెక్కును ఆర్ధిక శాఖ నుంచి వెంటనే క్లియరెన్సు ఇచ్చి వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కుబేర్లో విధించిన ఫ్రీజింగ్ను వెంటనే ఎత్తివేయాలని, బకాయి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుంద ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు బ్రహ్మాచారి, రత్నం రాజేందర్, పాయం ముత్తయ్య, రాములు, జలంధర్, లక్ష్మణ్నాయక్, తిరుపత మ్మ, సమ్మక్క, భద్రమ్మ, జోడలక్ష్మి, రామారావు, రాము, నాగమణి పాల్గొన్నారు