రామగుండం అభివృద్ధికి కృషి
ABN , First Publish Date - 2023-02-02T00:03:43+05:30 IST
రామగుండం కార్పొరేషన్, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు.
జ్యోతినగర్, ఫిబ్రవరి 1: రామగుండం కార్పొరేషన్, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. బుధవారం సాయంత్రం 24వ డివిజన్ పరిధిలో 2 కోట్ల రూపాయల విలువైన ఎఫ్సీఐ రోడ్డు నిర్మాణానికి ఎమ్మె ల్యే చందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజ కవర్గంలో మౌళిక వసతుల కల్పనతోపాటు అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయల నిధులను వినియోగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, కమిషనర్ సుమన్రావు, కార్పొరేటర్లు కొలిపాక సుజాత, కల్వచర్ల కృష్ణ వేణి, ఎన్వి.రమణారెడ్డి, కోఅప్షన్ సభ్యుడు వంగ శ్రీనివాస్, సంజీవ్, ఫయాజ్, రాజి రెడ్డి, ఐఎన్టీయూసీ నేత కొలిపాక మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.