ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

ABN , First Publish Date - 2023-01-26T00:12:45+05:30 IST

ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిందని, దేశాభివృద్ధికి సుపరిపాలన మంచి నాయకు న్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని జిల్లా జడ్జి వీరయ్య, కలెక్టర్‌ రవి నాయక్‌ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా జడ్జి వీరయ్య, కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు

- జిల్లా జడ్జి వీరయ్య, కలెక్టర్‌ రవి నాయక్‌

జగిత్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిందని, దేశాభివృద్ధికి సుపరిపాలన మంచి నాయకు న్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని జిల్లా జడ్జి వీరయ్య, కలెక్టర్‌ రవి నాయక్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టర్‌ కార్యాలయ స మావేశ మందిరంలో జరిగిన 13వ జాతీయ ఓటరు దినోత్సవానికి వారు హా జరయ్యారు. పలువురు ఓటర్లుకు ఓటరు ఎపిక్‌ కార్డులను పంపిణీ చేశారు. సీనియర్‌ ఓటర్లను సన్మానించారు. ఓటరు కిట్లను పంపిణీ చేశారు. ఉద్యోగు లు, సిబ్బందిచే ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంద ర్బంగా వారు మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్బయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, మంద మకరందు, కలెక్టరేట్‌ కార్యాలయ పలువురు సూపరెండెంట్లు, రెవెన్యూ అధికా రులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:12:48+05:30 IST