రేపు పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్
ABN , First Publish Date - 2023-02-07T00:43:44+05:30 IST
నగర శివారులోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు షేక్పేట్లోని పలు ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నగర శివారులోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలతో పాటు షేక్పేట్లోని పలు ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరాలో అంతరాయం తలెత్తనున్నట్లు వాటర్బోర్డు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్బోర్డు పరిధి ఖానాపూర్ లైన్ కోకాపేట్లోని మై హోమ్ అవతార్ వద్ద పీఎ్ససీ పైపులైన్ దెబ్బతిన్నది. దీంతో భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి 1200ఎంఎం డయా ఎంఎస్ బ్యారెల్ను అమర్చే మరమ్మతు పనులు బుధవారం, ఉదయం 6గంటల నుంచి గురువారం, ఉదయం 6గంటల వరకు చేపట్టనున్నారు. దీంతో షేక్పేట్, టోలీచౌకి, గోల్కొండ, చింతల్ బస్తి, విజయానగర్, ఓల్డ్ మల్లేపల్లి, గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాల గూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచిరేవుల గ్రామాలలో మంచి నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.