Tirumalagiri: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు

ABN , First Publish Date - 2023-02-01T14:24:15+05:30 IST

సరదా కోసం గుట్ట ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు గుట్టరాళ్ల నడుమ ఇరుక్కుపోయాడు. సమాచారం

Tirumalagiri: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు

హైదరాబాద్/తిరుమలగిరి: సరదా కోసం గుట్ట ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు గుట్టరాళ్ల నడుమ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న తిరుమలగిరి పోలీసులు మూడు గంటల శ్రమించి అతి కష్టం మీద డుంబర్‌ను కాపాడారు. ఈ ఘటన తిరుమలగిరి గుట్టవద్ద చోటు చేసుకుంది. మహరాష్ట్ర జూనేర్‌ అహ్మద్‌నగర్‌ చైతన్యపూర్‌ గ్రామానికి చెందిన అక్షయ్‌ డుంబర్‌(21) స్నేహితుడికి కలిసేందుకు తిరుమలగిరికి వచ్చాడు. స్నేహితుడి ఫోన్‌ నెంబర్‌ మిస్‌ కావడంలో రోజువారి వేతనం కింద పని చేస్తూ అక్కడేఉంటున్నాడు. ఈనెల 30న పని పూర్తి చేసుకుని బయటికి వచ్చిన డుంబర్‌ సేద తీరేందుకు ఒక్కడే తిరుమలగిరిలోని కేన్‌ కళాశాల సమీపంలో జయభారత్‌ సొసైటీ వద్ద ఉన్న బండరాళ్ల వద్దకు చేరుకున్నాడు.

బండరాళ్లపై నడుస్తున్నాడు. ప్రమాదవశాత్తు జారిపడి రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కేకలు వేశాడు. కొంతమంది అతడిని గమనించి తిరుమలగిరి పోలీసులకు తెలిపారు. పోలీసులు, అగ్నిమాక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని యువకుడి నడుముకు తాడు చుట్టి మూడు గంటలు శ్రమించి బయటికు తీశారు. అనంతరం డుంబర్‌ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే అతడిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్షయ్‌ డుంబర్‌ను కానిస్టేబుల్‌ వినిత్‌ మహారాష్ట్రకు పంపించేందుకు టికెట్‌ ఇప్పించి మహారాష్ట్రకు వెళ్లే రైలు ఎక్కించారు.

Updated Date - 2023-02-01T14:24:17+05:30 IST