తెలంగాణలో 3 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులకు ప్రతిపాదనలు
ABN , First Publish Date - 2023-02-07T03:43:16+05:30 IST
తెలంగాణలోని జక్రాన్పల్లి, పాల్వంచ, దేవరకద్ర ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి వీకే సింగ్ తెలిపారు.
కేంద్రమంత్రి వీకేసింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని జక్రాన్పల్లి, పాల్వంచ, దేవరకద్ర ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఆ మూడు ప్రాంతాల్లో అధ్యయనం తర్వాత జక్రాన్పల్లిలో మాత్రమే ఎయిర్పోర్టు ఏర్పాటుకు సాధ్యమవుతుందని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.