బీసీలకు మరోసారి అన్యాయం: ప్రవీణ్కుమార్
ABN , First Publish Date - 2023-02-07T04:17:20+05:30 IST
బడ్జెట్లో బీసీలకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
ధర్మారం, ఫిబ్రవరి 6: బడ్జెట్లో బీసీలకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నిర్వహించిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో సగం జనాభా బీసీలు ఉంటే బడ్జెట్లో మూడు శాతం నిధులు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. రూ.1.5లక్షల కోట్లు కేటాయించాల్సిన చోట రూ.6వేల కోట్లనే కేటాయించి, బీసీల పట్ల వివక్ష చూపారని విమర్శించారు.