NTR Ghatలో నివాళులర్పించనున్న నారా లోకేష్
ABN , First Publish Date - 2023-01-25T08:13:08+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్నారు.
హైదరాబాద్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్కు లోకేష్ చేరుకోనున్నారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధర్యంలో చంద్రబాబు ఇంటి నుంచి ఘాట్ వరకు బైక్ ర్యాలీ జరగనుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు నారా లోకేష్ చేరుకోనున్నారు. 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కడపకు లోకేష్ చేరుకోనున్నారు. కుప్పం నుంచి రాష్ట్ర వ్యాప్త యువగళం పేరుతో పాదయాత్రకు నారా లోకేష్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే.