murder: సహజీవనం చేస్తున్న మహిళ హత్య
ABN , First Publish Date - 2023-01-26T08:51:12+05:30 IST
సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడో వ్యక్తి. మిర్యాలగూడకు చెందిన రవి భార్య పందుల
హైదరాబాద్/బాలానగర్: సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడో వ్యక్తి. మిర్యాలగూడకు చెందిన రవి భార్య పందుల శారద(28) బాలానగర్ అంబిక కాలనీలో నివసిస్తూ కూలి పనిచేసుకొని జీవిస్తోంది. మిర్యాలగూడకు చెందిన గుడిసె హరికృష్ణ, ఆమె ఏడు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారు. శారదపై అనుమానంతో బుధవారం ఉదయం కత్తితో గొంతుకోసి చంపేశాడు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసి పారిపోయాడు. గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు బాలానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.