Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

ABN , First Publish Date - 2023-02-01T14:11:08+05:30 IST

సోషల్‌ మీడియాలో పరిచయమయ్యాడు. ప్రేమించానంటూ నమ్మించి ఆమెను ఢిల్లీ నుంచి

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

హైదరాబాద్/బంజారాహిల్స్‌: సోషల్‌ మీడియాలో పరిచయమయ్యాడు. ప్రేమించానంటూ నమ్మించి ఆమెను ఢిల్లీ నుంచి నగరానికి రప్పించాడు. మరుసటి రోజు ఉదయం పరారైన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశార. ఢిల్లీకి చెందిన యువతి(29) అక్కడే డ్యాన్సర్‌. మొదట వివాహమైంది. ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది. కొద్దికాలం క్రితం ఇన్‌స్టాలో జీడిమెట్లకు చెందిన సలావుద్దీన్‌ ఆఫ్రిదితో పరిచ యం ఏర్పడింది. ఇద్దరు తరుచూ చాటింగ్‌ చేసేవారు.

ఈ క్రమంలో సలావుద్దీన్‌ ప్రే మిస్తున్నానని ఆమెకు చెప్పాడు. ఆమెకు, బాబుకు తోడు ఉంటానని నమ్మించాడు. పె ళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె ఈ నెల 29న నగరానికి వచ్చింది. ఇద్దరు కలిసి బంజారాహిల్స్‌లో ఓయో గది తీసుకున్నారు. మరుసటి రోజు ఆమె నిద్ర లేవకముందే సలావుద్దీన్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా అందబాటులోకి రాలేదు. మోసపోయినట్టు గ్రహించి ఆమె బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సలావుద్దీన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-01T14:14:14+05:30 IST