ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తా

ABN , First Publish Date - 2023-02-07T03:30:35+05:30 IST

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి తాజాగా ప్రకటించారు.

ఖమ్మం అసెంబ్లీ  స్థానం నుంచి పోటీ చేస్తా

మాజీ మంత్రి రేణుక చౌదరి ప్రకటన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి తాజాగా ప్రకటించారు. గాంధీభవన్‌లో సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేను ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో పాటుగా రేణుక కలిశారు. అనంతరం మీడియాతో వివిధ అంశాలపై మాట్లాడారు. తనకు గుడివాడ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆహ్వానం ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ‘‘రేవంత్‌రెడ్డి పాదయాత్రలో నేను కూడా పాల్గొంటాను. ఆయన్ను ఖమ్మంకు ఆహ్వానించి పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తాం. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సీబీఐ విచారణ మంచిదే. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించే బాధ్యత ఎవరికీ అప్పచెప్పలేదు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎ్‌సలోకి మారిన ఎమ్మెల్యేలు గ్రామాల్లో ఓట్లకోసం ఎలావస్తారో చూస్తాం’’ అని రేణుక స్పష్టం చేశారు. కాగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తనవారికే పదవులు ఇప్పించుకుంటున్నారని జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు తాజాగా ఆరోపించారు.

Updated Date - 2023-02-07T03:30:37+05:30 IST