Republic Day : కేసీఆర్‌పై గవర్నర్ పరోక్ష విమర్శలు

ABN , First Publish Date - 2023-01-26T07:52:09+05:30 IST

రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతాకావిష్కరణ చేశారు.

Republic Day : కేసీఆర్‌పై గవర్నర్ పరోక్ష విమర్శలు

Republic Day : రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రభుత్వం తరుపున సీఎస్ శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై గవర్నర్ పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వ పని తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు- నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు- రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఉండాలి. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం - రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలంగాణతో నాకున్న బంధం మూడేళ్లు కాదు.. పుట్టుకతో ఉంది. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు.. కానీ నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ’’ అని గవర్నర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-26T12:15:32+05:30 IST