సీఎం చిత్రపటానికి ఉద్యోగుల క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2023-02-07T00:30:19+05:30 IST
హెల్త్ కార్డుల పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
మంగళ్హాట్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): హెల్త్ కార్డుల పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నాంపల్లి గృహకల్ప ప్రాంగణంలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్ హుస్సేని ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగ్గ విషయమన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు అన్ని విధాల అండగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి విక్రమ్కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్.రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు కుర్రాడి శ్రీనివాస్, సభ్యులు ఖాలీద్ అహ్మద్, శంకర్, పలు యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.