Kavitha: ఆ ప్రశ్నలే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు

ABN , First Publish Date - 2023-01-26T11:54:12+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వట్టర్ వేదికగా స్పందించారు.

Kavitha: ఆ ప్రశ్నలే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వట్టర్ వేదికగా స్పందించారు. ‘‘కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా, రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నాం. ఇలాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ గారు ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.

Updated Date - 2023-01-26T11:54:39+05:30 IST