10 నుంచి ఇంటింటికీ బీజేపీ

ABN , First Publish Date - 2023-02-07T03:44:13+05:30 IST

ఈ నెల 10వ తేదీ నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కార్యక్రమ కన్వీనర్‌ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

10 నుంచి ఇంటింటికీ బీజేపీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 10వ తేదీ నుంచి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగోస-బీజేపీ భరోసా పేరిట ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కార్యక్రమ కన్వీనర్‌ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు-వైఫల్యాలను విస్తృతంగా ప్రచారం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 750 మంది రాష్ట్ర, జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. వీరికి మంగళవారం వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని శక్తి కేంద్రాల్లో 11వేల సభలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2023-02-07T03:44:13+05:30 IST