Bandi Sanjay : గవర్నర్ను కట్టడి చేయడానికి కేసీఆర్ కుట్ర
ABN , First Publish Date - 2023-01-25T13:33:14+05:30 IST
సీఆర్ ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
Hyderabad : కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. పరేడ్గ్రౌండ్లో ఏటా నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకలను.. ప్రభుత్వం రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమన్నారు. అంబేద్కర్ను అవమానించేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలనే.. సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమే ఇది అని బండి సంజయ్ పేర్కొన్నారు.