Bandi Sanjay : స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి

ABN , First Publish Date - 2023-01-23T12:56:12+05:30 IST

జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

Bandi Sanjay : స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి

Bandi Sanjay : జీవో 317కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్న‌ారు. జీవో 317తో ఉపాధ్యాయుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హాయాంలో ఐఏఎస్ అధికారికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు 42రోజుల పాటు సకలజనుల సమ్మె చేయకుంటే తాను సీఎం అయ్యేవాడిని కాదని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి బయటకు గుంజుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. టీచర్ల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కూడా సీఎం కేసీఆర్ బాధితులమేనని గుర్తుంచుకోవాలన్నారు. సాటి ఉద్యోగుల పట్ల పోలీసుల తీరు బాధాకరమని.. జీవో 317పై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామని బండి సంజయ్ వెల్లడించారు.

Updated Date - 2023-01-23T12:56:15+05:30 IST