కంటైనర్‌ ఢీకొని హోంగార్డు మృతి

ABN , First Publish Date - 2023-01-26T01:37:54+05:30 IST

వాహనాలను తనిఖీ చేస్తు న్న ఓ హోంగార్డును కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన చనిపోయారు. మేడ్చల్‌ మండల పరిధిలోని

కంటైనర్‌ ఢీకొని హోంగార్డు మృతి

మేడ్చల్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): వాహనాలను తనిఖీ చేస్తు న్న ఓ హోంగార్డును కంటైనర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన చనిపోయారు. మేడ్చల్‌ మండల పరిధిలోని కండ్లకోయ కూడలి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఈ ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ వెంకటే్‌షతో కలిసి కానిస్టేబుల్‌ రాంచందర్‌, హోంగార్డు శ్రీనివా్‌సలు కండ్లకోయ వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో మేడ్చల్‌ వైపు నుంచి కొంపల్లి వైపు వెళుతున్న ఓ కంటైనర్‌ను ఆపాలని శ్రీనివాస్‌ చేతితో సైగ చేశారు. డ్రైవర్‌ వాహనాన్ని పక్కకు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు శ్రీనివా్‌సను ఢీకొట్టడంతో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీనివా్‌సది వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం చాపలగూడెం. ఉద్యోగ రీత్యా భార్యా పిల్లలతో కలిసి మేడ్చల్‌లో ఉంటున్నారు. కంటైనర్‌ డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Updated Date - 2023-01-26T01:37:55+05:30 IST