Bhatti Vikramarka: తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు
ABN , First Publish Date - 2023-05-25T21:20:33+05:30 IST
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు.
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. తెలంగాణలో స్వేచ్ఛ లేదని, కాంగ్రెస్ (Congress) పంచిన అటవీభూములను కేసీఆర్ గుంజుకున్నారని విమర్శించారు. పోడు భూముల పట్టాలను గిరిజనులు చూపించారని, పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని చెప్పారు. ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని, రైతులు ఆందోళనలో ఉన్నారని భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. భట్టి పాదయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కాంగ్రెస్ సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖిందర్ సుక్కు, మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, బోసురాజు, చిన్నారెడ్డి, నాగం, సంపత్ పాల్గొన్నారు.