ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి: అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

ABN , First Publish Date - 2023-02-06T22:45:11+05:30 IST

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 6: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి ఆమె దరకాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి సమస్యల పరిష్కారానికి కృషి: అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 6: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి ఆమె దరకాస్తులను స్వీకరించారు. జిల్లాలోని బెజ్జూరు మండలం జైహింద్‌పూర్‌ గ్రామస్థులు కొత్త చెరువులో ముంపునకు గురైన భూములకు నష్టపరిహారం అందిం చాలని అర్జీ సమర్పించారు. పెంచికలపేట మండలం దరోగపల్లి గ్రామానికి చెందిన సద్గరి లస్మయ్య తాను జన్కాపూర్‌ శివారులోని పోడు భూమిని సాగు చేస్తూ జీవిస్తున్నాని, భూమిపై తనకు నూతన పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసి రైతుబంధు వర్తింపజేయాలని దరఖాస్తు అందజేశారు. సిర్పూర్‌ (టి) మండలకేంద్రానికి చెందిన సాలినా పర్వీన్‌ నిరుపేదరాలిని అయిన తనకు ప్రభుత్వం అందిస్తున్న రెండు పడకల గదుల పథకంలో అవకాశం కల్పించి ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అంద జేసింది.

Updated Date - 2023-02-06T22:45:12+05:30 IST