Women's Cricket League: మహిళల క్రికెట్ లీగ్ మార్చి 4 నుంచి ముంబైలో..
ABN , First Publish Date - 2023-02-07T02:51:27+05:30 IST
ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను వచ్చే నెల 4 నుంచి 26 వరకు ముంబైలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ సోమవారం ప్రకటించాడు.
న్యూఢిల్లీ: ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను వచ్చే నెల 4 నుంచి 26 వరకు ముంబైలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ సోమవారం ప్రకటించాడు. లీగ్లో జరిగే మొత్తం 22 మ్యాచ్లకు బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలు వేదికలుగా ఉంటాయని చెప్పాడు. తొలి మ్యాచ్ గుజరాత్, ముంబై జట్ల మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ నెల 13న ప్లేయర్ల వేలాన్ని నిర్వహించనున్నారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుండగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు తుది పోరులో చోటు కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.