Guru Naidu: గురునాయుడుకు స్వర్ణం
ABN , First Publish Date - 2023-02-07T02:58:13+05:30 IST
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్. గురునాయుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్వర్ణం సాధించాడు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్. గురునాయుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్వర్ణం సాధించాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సోమవారం జరిగిన 55 కిలోల బాలుర వెయిట్ లిఫ్టింగ్లో గురు నాయుడు 227 కిలోల (స్నాచ్ 103+జెర్క్ 124) బరువెత్తి ప్రథమస్థానంలో నిలిచాడు.