జడేజాకు 7 వికెట్లు
ABN , First Publish Date - 2023-01-27T03:13:42+05:30 IST
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 7 వికెట్లతో విజృంభించడంతో..సౌరాష్ట్రతో రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో తమిళనాడు 133 రన్స్కే కుప్పకూలింది. మోకాలి గాయం కారణంగా కొన్ని
చెన్నై: టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 7 వికెట్లతో విజృంభించడంతో..సౌరాష్ట్రతో రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో తమిళనాడు 133 రన్స్కే కుప్పకూలింది. మోకాలి గాయం కారణంగా కొన్ని నెలలు క్రికెట్కు దూరమైన జడ్డూ.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముందు ఫిట్నెస్ నిరూపించుకోవడానికి దక్కిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకొన్నాడు. కాగా, 266 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. మూడో రోజు ఆటముగిసే సమయానికి 4/1 స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 324.. సౌరాష్ట్ర 192 పరుగులు సాధించాయి.