UP: ప్రేయసిని చంపి స్నానానికి వెళ్లిన ప్రియుడు.. తిరిగొచ్చేసరికి తల్లి మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఆమె కొడుకును చూసి..

ABN , First Publish Date - 2023-02-07T17:48:09+05:30 IST

పక్క చూపులకు అలవాటు పడ్డ ఓ వ్యక్తి తనతో సహజీవనంలో ఉన్న మహిళను దారుణంగా చంపేశాడు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న మృతురాలి కుమారుడిని కూడా కర్కశకంగా కడతేర్చాడు.

UP: ప్రేయసిని చంపి స్నానానికి వెళ్లిన ప్రియుడు.. తిరిగొచ్చేసరికి తల్లి మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఆమె కొడుకును చూసి..

ఇంటర్నెట్ డెస్క్: పక్క చూపులకు అలవాటు పడ్డ ఓ వ్యక్తి తనతో సహజీవనంలో ఉన్న మహిళను దారుణంగా చంపేశాడు. తల్లి మరణంతో కన్నీరుమున్నీరవుతున్న మృతురాలి కుమారుడిని కూడా కర్కశకంగా కడతేర్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) కాన్పూర్(Kanpur) జిల్లాలో ఆదివారం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్హౌర్ టౌన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలో సీమా దివాకర్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు పన్నెండేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె గత రెండున్నర ఏళ్లుగా నరేంద్ర యాదవ్‌ అనే వ్యక్తితో సహజీవనం(Live-in Relationship) చేస్తోంది.

ఇటీవల కాలంలో నరేంద్ర యాదవ్ ఇతర మహిళలతో సన్నిహితంగా మెలుగుతుండటంతో సీమా అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు(Quarrel) జరిగేవి. సీమ తన దారికి అడ్డొస్తోందని ఆగ్రహించిన నరేంద్ర యాదవ్ ఇటీవల ఆమెను గొంతు నులిమి చంపేశాడు. ఆ తరువాత..ఏమీ జరగనట్టుగా స్నానానికి వెళ్లిపోయాడు. బాత్రూమ్‌ నుంచి బయటకు వచ్చిన నరేంద్రకు మహిళ కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. నువ్వే అమ్మను చంపావు అంటూ అతడు కన్నీరుమున్నీరయ్యాడు.

ఈ క్రమంలో మరింతగా రెచ్చిపోయిన నిందితుడు ఆ పసివాడినీ కడతేర్చాడు. గొంతుచుట్టూ చున్నీ బిగించి చంపేశాడు. పోలీసులకు చిక్కాక కూడా అతడు తను చేసిన నేరం నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు స్టేట్‌మెంట్‌ను మర్చాడని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-02-07T17:52:51+05:30 IST