ఆఖరిసారిగా కొడుకును చూసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి.. ఆమె మరణానికి కారణం ఎవరంటే..

ABN , First Publish Date - 2023-02-05T15:59:31+05:30 IST

కొడుకును చూసొచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఆమె మరణానికి కారణం తెలిసి అందరూ విస్తుపోతున్నారు

ఆఖరిసారిగా కొడుకును చూసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి.. ఆమె మరణానికి కారణం ఎవరంటే..

ఓ తల్లి హాస్పిటల్ కి వెళ్ళి చికిత్స పొందుతున్న కొడుకును చూసి వచ్చింది. ఆ తరువాత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కొడుకు చేస్తున్నపనులు చూడలేకే ఆమె ప్రాణాలు తీసుకుందనే చేదు నిజం తెలిసాక ఇలాంటి కొడుకులు ఎందుకు పుడతారో ఏంటో అంటున్నారు అందరూ.. తల్లి ప్రాణాలు తీసుకునేలా ఆ కొడుకు ఏం చేసాడో తెలుసుకుంటే..

రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో గీత అనే మహిళ నివసిస్తోంది. ఆమె కొడుకు దీపక్ చదువు వంటబట్టక రౌడీ షీటర్ గా మారాడు. అతనికి తోడు శరత్ అనే మరొక వ్యక్తి తోడయ్యాడు. ఏ పని చేసినా వాళ్ళిద్దరూ కలిసి చేసేవారు. శరత్, దీపక్ ఇద్దరు ఒక వ్యాపారస్తుడిని కిడ్నాప్ చేసారు. దాదాపు మూడురోజుల పాటు అతన్ని వారితోనే తిప్పుకుంటూ వ్యాపారస్తుడి తండ్రిని 35లక్షల రూపాయలు డిమాండ్ చేసారు. ఒకవేళ డబ్బులు ఇవ్వని పక్షంలో తాము అడిగిన స్థలాన్ని తాము చెప్పినవారి పేరు మీద రిజిస్టర్ చెయ్యాలని చెప్పారు. అయితే ఆ వ్యాపారస్తుడి తండ్రి తెలివిగా పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వ్యాపారస్తుడి తండ్రికి వస్తున్న ఫోన్ కాల్స్ ఆధారంగా లొకేషన్ ను ట్రేస్ చేసి దుండగులను పట్టుకునే ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నంలో భాగంగా పోలీసులు దుండగులు ప్రయాణిస్తున్న కారును వెంబడించారు. పోలీసుల నుండి పారిపోయే ప్రయత్నంలో రౌడీషీటర్ల కారు డివైడర్ ను గుద్దింది. పోలీసులు వ్యాపారస్తుడిని రక్షించారు. అయితే కారు డివైడర్ ను ఢీకొట్టినప్పుడు దీపక్ గాయపడ్డాడు. అతడిని ఉదయ్ పూర్ రాజ్ సమంద్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసారు.

కొడుకు ప్రమాదం గురించి తెలుసుకున్న దీపక్ తల్లి హాస్పిటల్ కు వెళ్ళి అతడిని చూసొచ్చింది. అనంతరం మనస్తాపంతో విషం తాగింది. ఆమెను హాస్పిటల్ కు తరలించినా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా దీపక్ పై 25 కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. దీపక్ తల్లి మరణం గురించి విన్నవారు ఇలాంటి కొడుకులు ఎందుకు పుడతారో ఏమో అంటున్నారు.

Updated Date - 2023-02-05T16:05:01+05:30 IST