ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. వారిని పట్టుకున్న గ్రామస్థులు, భర్త ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-01-22T20:38:33+05:30 IST

వివాహితతో ప్రేమాయణం సాగించి, ఆమెను కలిసేందుకు వెళ్లిన యువకుడు భారీ మూల్యం చెల్లించాడు.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మహిళ భర్త, గ్రామస్థులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పంచాయితీ నిర్వహించారు..

ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. వారిని పట్టుకున్న గ్రామస్థులు, భర్త ఏం చేశారంటే..

వివాహితతో ప్రేమాయణం సాగించి, ఆమెను కలిసేందుకు వెళ్లిన యువకుడు భారీ మూల్యం చెల్లించాడు.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో మహిళ భర్త, గ్రామస్థులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పంచాయితీ నిర్వహించారు.. చివరకు ఆ మహిళను ఆ యువకుడు వివాహం చేసుకున్నాడు.. బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఈ ఘటన జరగింది (Bihar News).

బెగుసరాయ్ జిల్లాలోని మక్దుంపూర్‌కు చెందిన నిషా కుమారికి ఐదేళ్ల క్రితం ధర్మదేవ్‌‌తో వివాహం జరిగింది. వీరిద్దరికీ మాన్వి, జాన్వీ అనే ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. రెండేళ్ల క్రితం నిషా జీవితంలోకి వికాస్ కుమార్ అనే వ్యక్తి ప్రవేశించాడు. వికాస్‌తో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకున్న నిషా అతడికి శారీరకంగా కూడా దగ్గరైంది. వీలైనప్పుడల్లా అతడిని కలిసేది. శనివారం సాయంత్రం ఎప్పటిలాగానే నిషా కుమారిని కలిసేందుకు వికాస్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో గ్రామస్థులు వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భర్త ధర్మదేవ్‌కు సమాచారం ఇచ్చారు.

ధర్మదేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు వర్గాల వారిని పిలిచి స్టేషన్‌లో పంచాయితీ నిర్వహించారు. నిషా కుమారి తన భర్తతో కలిసి ఉండేందుకు నిరాకరించింది. వికాస్ కూడా నిషాను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో గ్రామస్తులు నిషా కుమారి, వికాస్ కుమార్‌లకు ఆలయంలో వివాహం జరిపించారు.

Updated Date - 2023-01-22T20:38:35+05:30 IST