Viral: అకస్మాత్తుగా కనకవర్షం.. రూ.10 నోట్లు ఏరుకునేందుకు ఎగబడ్డ జనం..

ABN , First Publish Date - 2023-01-24T20:49:51+05:30 IST

బెంగళూరులో ఓ వ్యక్తి ఫ్లైఓవర్‌పై నిలబడి ప్రజలపై నోట్లు వెదజల్లాడు.

Viral: అకస్మాత్తుగా కనకవర్షం.. రూ.10 నోట్లు ఏరుకునేందుకు ఎగబడ్డ జనం..

ఇంటర్నెట్ డెస్క్: మనిషి జీవితంలో డబ్బు ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అధిక శాతం మంది డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కానీ.. బెంగళూరులో(Bengaluru) ఓ వ్యక్తి మాత్రం తన డబ్బును ప్రజలపై వెదజల్లాడు. పట్టపగలు.. ఫ్లైఓవర్‌పై నిలబడి బ్యాగు నిండా తెచ్చుకున్న రూ.10 నోట్లను కిందున్న వారిపై విసిరేశాడు. కలాసిపాళ్య ప్రాంతంలో మైసూర్ రోడ్డు ఫ్లై ఓవర్‌పై(Mysore Road Flyover) ఈ వింత ఘటన జరిగింది. నోట్ల వర్షం కురవడంతో రోడ్డుపై(Raining Currency notes) ఉన్న ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఫ్లైఓవర్‌పై నిలబడ్డ వ్యక్తిని చూసి నోరెళ్లబెట్టారు. మరికొందరు.. నోట్లను తీసుకునేందుకు ఎగబడడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఇదంతా చూసిన ట్రాఫిక్ పోలీసులు ఏం జరుగుతోందో అర్థంకాక అలా చూస్తుండిపోయారట. ఈ ఘటనపై డీసీపీ స్పందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తమ వద్ద లేవని, అన్ని వివరాలు సేకరించాక తెలియజేస్తామని అన్నారు. తాజా సమాచారం ప్రకారం అరుణ్ అనే వ్యక్తి నోట్లు వెదజల్లాడని తెలుస్తోంది. అతడు ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తాడట. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-01-24T20:49:56+05:30 IST