Bengaluru: రాష్ట్రంలో కనిపించిన రంగుల మిడత
ABN , First Publish Date - 2023-02-02T12:16:38+05:30 IST
దక్షిణ భారత దేశంలోనే ప్రప్రథమంగా కర్ణాటక చామరాజనగర(Chamarajanagara) జిల్లా బిళిగిరి రంగనబెట్ట అటవీ ప్రాంతం
- దక్షిణాదిన ఇదే ప్రథమమంటున్న కీటక పరిశోధకులు
బెంగళూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత దేశంలోనే ప్రప్రథమంగా కర్ణాటక చామరాజనగర(Chamarajanagara) జిల్లా బిళిగిరి రంగనబెట్ట అటవీ ప్రాంతంలో రంగుల మిడత కనిపించింది. కీటకాల పరిశోధకులు ఈ కొత్త కీటకానికి సోలిగా ఇకారి నటా అని నామకరణం చేశారు. 15 సంవత్సరాల క్రితం నాగాల్యాండ్లో ఈ కీటకం ఉనికి ఉండే దన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తొలిసారి ఇది కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. కీటకాలపై పరిశోధనలు జరుపుతున్న ప్రియదర్శన్, రంజిత్ అనే వారు ఈ అపురూప కీటకాన్ని గుర్తించారు.
ఇదికూడా చదవండి: Chief Minister: జలవనరుల చరిత్రలో ఇదో రికార్డు: సీఎం