ముద్దులొలికే ఈ చిన్నారులు.. ఆడుకోవడానికని బయటకు వెళ్లి తిరిగి రాలేదు.. ముగ్గురూ ఒకేసారి చనిపోవడం వెనుక..

ABN , First Publish Date - 2023-01-25T15:34:26+05:30 IST

రాజస్థాన్‌లోని (Rajasthan) డియోలి పట్టణంలో దారుణం జరిగింది. ఆడుకోవడానికని బయటకు వెళ్లిని ముగ్గురు చిన్నారులు మళ్లీ తిరిగి ఇళ్లకు చేరలేదు. సాయంత్రం వరకు గాలించాక సమీపంలోని చెరువులో వారి మృతదేహాలు కనిపించాయి.

ముద్దులొలికే ఈ చిన్నారులు.. ఆడుకోవడానికని బయటకు వెళ్లి తిరిగి రాలేదు.. ముగ్గురూ ఒకేసారి చనిపోవడం వెనుక..

రాజస్థాన్‌లోని (Rajasthan) డియోలి పట్టణంలో దారుణం జరిగింది. ఆడుకోవడానికని బయటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మళ్లీ తిరిగి ఇళ్లకు చేరలేదు. సాయంత్రం వరకు గాలించాక సమీపంలోని చెరువులో వారి మృతదేహాలు కనిపించాయి. ఆ ముగ్గురిలో ఇద్దరు స్వయానా అక్కా చెల్లెళ్లు కావడంతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. బాలికల మృతితో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

డియోలికి సమీపంలోని కళ్యాణ్‌పురా గ్రామానికి చెందిన బాలికలు కిరణ్ మీనా (9), రియా మీనా (7), టీనా (10) ధాకడ్ గ్రామంలోని పాఠశాలలో చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ముగ్గురు బాలికలు ఆడుకోవడానికి చెప్పి బయటకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారి కోసం గ్రామమంతా గాలించారు. చివరకు పాఠశాలకు సమీపంలోని చెరువు నీటిలో బాలికల చెప్పులు కనిపించాయి (3 girls drowned in pond).

కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు అనుమానం వచ్చింది. కొందరు ఈతగాళ్లు చెరువులోకి దిగి వెతకగా రియా, కిరణ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. టీనా మృతదేహం మాత్రం కనిపించలేదు. చివరకు మంగళవారం రాత్రి 9.30 గంటలకు టీనా మృతదేహాన్ని బయటకు తీశారు. మూడు మృతదేహాలను పోలీసులు మార్చురీలో ఉంచి బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.

Updated Date - 2023-01-25T15:34:28+05:30 IST