NRI: న్యూజిలాండ్‌లో విషాదం.. బీచ్‌‌లో ఈత కొడుతూ ఇద్దరు భారతీయులు మృతి!

ABN , First Publish Date - 2023-01-26T08:02:51+05:30 IST

న్యూజిలాండ్‌లో (New Zealand) విషాదం చోటు చేసుకుంది.

NRI: న్యూజిలాండ్‌లో విషాదం.. బీచ్‌‌లో ఈత కొడుతూ ఇద్దరు భారతీయులు మృతి!

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో (New Zealand) విషాదం చోటు చేసుకుంది. బీచ్‌‌లో ఈత కొడుతూ ఇద్దరు భారతీయులు సముద్రంలో మునిగిపోయారు. మృతులను సౌరిన్ నయన్ కుమార్ పటేల్(28), అన్షుల్ షా(31)గా గుర్తించారు. మృతులిద్దరూ గుజరాత్‌లోని (Gujarat) అహ్మదాబాద్‌కు చెందిన వారు. వీరిద్దరూ అక్లాండ్‌లో (Auckland) రూమ్‌మేట్స్‌గా ఉంటున్నారు. నయన్ కుమార్ పటేల్ ఎలక్రికల్ ఇంజనీర్. అతను గతేడాదే న్యూజిలాండ్ వెళ్లాడు. ఇక అన్షుల్ షా మూడు నెలల కింద అక్కడికి వెళ్లి, ఓ గ్యాస్ స్టేషన్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ విషాద ఘటనపై వీరి మిత్రుడు హిరేన్ పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతులతో పాటు మరో వ్యక్తి అపూర్వ్ మోదీ కూడా ఘటనాస్థలిలోనే ఉన్నాడని చెప్పాడు. అపూర్వ్ వారిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని హిరేన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే ప్రమాదంలో తమ ఇద్దరు మిత్రులను కోల్పోవడంపై అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. పటేల్, షా మరణాన్ని న్యూజిలాండ్‌లోని భారత హైకమీషన్ ధృవీకరించింది. ఇది న్యూజిలాండ్‌లోని భారతీయ సమాజానికి పెద్ద విషాదమని హైకమీషన్ తన ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-01-26T08:02:53+05:30 IST