తమిళనాడు గవర్నర్ రవి, సీఎం స్టాలిన్ కరచాలనం
ABN , First Publish Date - 2023-01-27T02:54:12+05:30 IST
ఇటీవల తమిళనాడు రాజ్భవన్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా
చెన్నై, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఇటీవల తమిళనాడు రాజ్భవన్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు మాత్రం హాజరయ్యారు. గవర్నర్ ఆర్ఎన్ రవి బుధవారం స్వయంగా స్టాలిన్కు ఫోన్ చేసి ఆహ్వానించడంతో ఆయన వెళ్లినట్టు ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధి, మరో ముగ్గురు మంత్రులు మాత్రమే ఈ తేనీటి విందుకు హాజరయ్యారు. అయితే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో పాటు, ఆ పార్టీ మిత్రపక్షాలు సైతం ఈ తేనీటి విందును బహిష్కరించాయి.