కొత్త కొత్తగా...
ABN , First Publish Date - 2023-02-02T03:17:52+05:30 IST
ఎంఎస్ఎంఈలు, భారీ పరిశ్రమలు, ధార్మిక సంస్థలు తమ పత్రాలు భద్రంగా దాచుకోవడానికి వీలుగా ‘ఎంటిటీ డీజీలాకర్’.
ఎంఎస్ఎంఈలు, భారీ పరిశ్రమలు, ధార్మిక సంస్థలు తమ పత్రాలు భద్రంగా దాచుకోవడానికి వీలుగా ‘ఎంటిటీ డీజీలాకర్’.
కొత్త అవకాశాలు, వ్యాపార ఆలోచనలు, ఉపాధి కల్పన కోసం 5జీ సేవల ఆధారంగా రూపొందించే యాప్ల సృష్టికి 100 సరికొత్త ప్రయోగ కేంద్రాలు.
‘గోబర్ధన్’ కింద వ్యర్థాల నుంచి సంపద సృష్టించేలా 500 కొత్త ప్లాంట్లు.
వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ సాగు చేపట్టేలా ప్రోత్సాహం. దీనికోసం పదివేల బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు.
‘ఇండస్ట్రీ 4.0’కు సిద్ధంగా కృత్రిమ మేఽధ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఐవోటీ, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్స్ తదితర సాంకేతికత నైపుణ్యాలపై లక్షలాది మందికి శిక్షణ... దీనికి ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0’గా నామకరణం.
మన యువత అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేలా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్స్ ఏర్పాటు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాధారిత స్టార్టప్స్ ఏర్పాటుకు ‘అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్’.
63వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణకు రూ.2516 కోట్లు.
ఔషధ రంగంలో పరిశోధనల ప్రోత్సాహానికి కొత్త పథకం.
రేవులు, ఉక్కు, బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రవాణా, కనెక్టివిటీ కోసం రూ.75వేల కోట్ల పెట్టుబడి.
మౌలిక సదుపాయాల్లో ప్రైవేటుకు అవకాశాలు పెంచేలా... ‘న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్’ ఏర్పాటు.
పిల్లలు, చిన్నారుల కోసం ‘డిజిటల్ లైబ్రరీ’లు.
సుమారు లక్ష తాళపత్ర గ్రంఽథాల డిజిటలీకరణకోసం ‘భారత్ షేర్డ్ రిపాసిటరీ ఆఫ్ ఇన్స్ర్కిప్షన్స్’ పథకం.
‘ఐగాట్ కామయోగి’ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ.
‘మేక్ ఐఏ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇన్ ఇండియా అండ్ మేక్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’ కింద మూడు ఉన్నత స్థాయి కేంద్రాలు.
ప్రయోగ శాలల్లో వజ్రాల తయారీ కోసం ప్రత్యేక నిధి.
చిత్తడి నేలల వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ పర్యాటకం పెంపు కోసం ‘అమృత్ ధారోహర్’ పథకం. మూడేళ్లపాటు అమలు.
దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా 50 పర్యాటక కేంద్రాల అభివృద్ధి. ‘దేఖో అప్నా దేశ్’ పేరుతో పర్యాటకానికి ప్రోత్సాహం.