Gayatri Raghuram: అన్నామలైకు పోటీగా పాదయాత్ర
ABN , First Publish Date - 2023-01-25T07:49:32+05:30 IST
తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై కక్ష తీర్చుకునేందుకు నటి గాయత్రి రఘురాం(Gayatri Raghuram)
- గాయత్రి రఘురాం
పెరంబూర్(చెన్నై), జనవరి 24: తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై కక్ష తీర్చుకునేందుకు నటి గాయత్రి రఘురాం(Gayatri Raghuram) సిద్ధమైనట్లున్నారు. ఇందులో భాగంగా అన్నామలైకి పోటీగా తను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్నామలై పాదయాత్ర ఏప్రిల్ 14న తిరుచ్చెందూర్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ నెల 27న చెన్నై నుంచి కన్నియాకుమారి వరకు పాదయాత్ర(Padayatra) ప్రారంభించనున్నట్లు గతంలో గాయత్రి రఘురాం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అన్నామలై పాదయాత్ర ఏప్రిల్లో చేపట్టనుండడంతో అదే సమయంలో తన పాదయాత్ర కూడా వుండేలా గాయత్రి రఘురాం సన్నాహాలు చేసుకుంటున్న ఆమె మంగళవారం దానిపై స్పష్టత ఇచ్చారు. అన్నామలై పాదయాత్రకు వ్యతిరేకంగా తన పాదయాత్ర సాగుతుందని, ఎన్ని అడ్డంకులు, బెదిరింపులు వచ్చినా దానిని కొనసాగిస్తామని ఆమె ప్రకటించారు.