విద్వేష ప్రసంగాల అంతం ప్రభుత్వాల విధి: సుప్రీం

ABN , First Publish Date - 2023-02-07T03:10:54+05:30 IST

దేశంలో విద్వేష పూరిత ప్రసంగాలు కొనసాగుతుండడాన్ని సోమవారం సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. లౌకిక దేశంలో ఇలాంటి వాటికి చోటులేదని తెలిపింది.

విద్వేష ప్రసంగాల అంతం ప్రభుత్వాల విధి: సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశంలో విద్వేష పూరిత ప్రసంగాలు కొనసాగుతుండడాన్ని సోమవారం సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. లౌకిక దేశంలో ఇలాంటి వాటికి చోటులేదని తెలిపింది. ‘‘మతాన్ని ఆధారం చేసుకొని విద్వేషపూరిత నేరాలు చేస్తామంటే లౌకిక రాజ్యంలో కుదరదు. అలాంటివాటిని కూకటి వేళ్లతో పెకిలించాలి. ప్రభుత్వాలకు సంకల్పం ఉంటే వాటి అంతును చూడాలి. విద్వేష ప్రసంగాలు లేకుండా చూడడమే ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం కావాలి’’ అని వ్యాఖ్యానించింది. తాను విద్వేషపూరిత దాడికి గురయ్యానని పేర్కొంటూ నోయిడాకు చెందిన 62 ఏళ్ల కజీం అహ్మద్‌ షేర్వాణి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated Date - 2023-02-07T03:10:55+05:30 IST