Basant Panchami: గంగా సంగమంలో 32 లక్షలమంది భక్తుల పుణ్యస్నానాలు
ABN , First Publish Date - 2023-01-27T08:11:46+05:30 IST
ఉత్తరభారతదేశంలో బసంతపంచమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి....
ప్రయాగ్రాజ్(ఉత్తరప్రదేశ్): ఉత్తరభారతదేశంలో బసంతపంచమి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.(Basant Panchami) మాఘమేళాలో భాగంగా లక్షలాదిమంది భక్తులు గంగా, సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. (Holy dip in Ganga)బసంత్ పంచమి సందర్భంగా సరస్వతి పూజలు చేశారు. ప్రయాగరాజ్ నగరంలో మాఘమేళాలో భాగంగా గంగా, యమునా నదుల సంగమం వద్ద భక్తులు(Devotees) ఆవు పేడను కాల్చి పవిత్ర స్నానాలు చేశారు.సీసీటీవీ, బాడీ, డ్రోన్ కెమెరాల ద్వారా భక్తులను పర్యవేక్షించారు.తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 32 లక్షల మంది భక్తులు గంగా నది సంగమంలో స్నానాలు చేశారని అదనపు మేళా అధికారి వివేక్ చతుర్వేది తెలిపారు.