subsidies : రాయితీలకు కోత!

ABN , First Publish Date - 2023-02-02T03:13:27+05:30 IST

ఆహారం, ఎరువులు, పెట్రో(ప్రధానంగా వంట గ్యాస్‌) ఉత్పత్తులపై సబ్సిడీలు భారీగా తగ్గనున్నాయి. ఈ మూడింటిపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రూ.5.21 లక్షల కోట్లుగా

subsidies : రాయితీలకు కోత!

ఆహారం, ఎరువులు, వంట గ్యాస్‌పై తగ్గనున్న సబ్సిడీ..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆహారం, ఎరువులు, పెట్రో(ప్రధానంగా వంట గ్యాస్‌) ఉత్పత్తులపై సబ్సిడీలు భారీగా తగ్గనున్నాయి. ఈ మూడింటిపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రూ.5.21 లక్షల కోట్లుగా ఉన్న సవరించిన రాయితీ అంచనాలు.. 2023-24 బడ్జెట్‌లో రూ.3.74 లక్షల కోట్లకు పరిమితం కానున్నాయి. బడ్జెట్‌ నివేదిక ప్రకారం 2022-23 బడ్జెట్‌లో ఆహారం, ఎరువులు, పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీలను రూ.3,17,866 కోట్లుగా ప్రకటించారు. అయితే, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వీటిని భారీగా పెంచారు. దీంతో మొత్తం సబ్సిడీలు రూ.5,21,584.71 కోట్లకు చేరాయి. దీనిని 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గించాలని నిర్ణయించారు. ఆహారం, ఎరువులు, పెట్రో ఉత్పత్తులపై కలిపి సబ్సిడీని రూ.3,74,707.01 కోట్లకు పరిమితం చేయనున్నారు. తద్వారా 28 శాతం మేరకు సబ్సిడీలు తగ్గనున్నాయి.

Updated Date - 2023-02-02T03:13:28+05:30 IST