బడ్జెట్‌తో జనంలోకి బీజేపీ

ABN , First Publish Date - 2023-02-02T01:59:16+05:30 IST

మరో ఏడాదిలో జాతీయ ఎన్నికలు జరుగుతాయనగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన చివరి ఆర్థిక

బడ్జెట్‌తో జనంలోకి బీజేపీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 : మరో ఏడాదిలో జాతీయ ఎన్నికలు జరుగుతాయనగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన చివరి ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లోని ప్రజానుకూలమైన అంశాలకు విస్తృత ప్రచారం కల్పించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. బుధవారం పార్లమెంటుకు బడ్జెట్‌ సమర్పించిన మరుక్షణం నుంచే దీనిపై ప్రచారం మొదలైంది ఈ ప్రచారం రానున్న 12 రోజులపాటు సాగించనున్నారు. బిహార్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీకి మొత్తం కార్యక్రమ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఏ రోజున ఏ రూపంలో ప్రజలకు చేరువ కావాలనేది నిర్ణయించేందుకు సునీల్‌ బన్సాల్‌ సహా తొమ్మిదిమందితో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటుచేశారు.

Updated Date - 2023-02-02T01:59:18+05:30 IST