కస్టమర్లా హోటల్కు వెళ్లిన ఎస్సై.. అసలు లోపల ఏం జరుగుతోందో ఎలా బయటపడిందంటే..
ABN , First Publish Date - 2023-01-29T19:14:11+05:30 IST
హర్యానాలోని (Haryana) హిసార్ పోలీసులు ఓ హోటల్పై దాడి చేసి వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. వారిని పట్టుకునేందుకు ఓ ఎస్సై కస్టమర్లో ఆ హోటల్కు వెళ్లాడు. ఓ రూ.500 నోటుపై సంతకం చేసి దానిని పట్టుకుని లోపలకు వెళ్లాడు.
హర్యానాలోని (Haryana) హిసార్ పోలీసులు ఓ హోటల్పై దాడి చేసి వ్యభిచార ముఠాను పట్టుకున్నారు. వారిని పట్టుకునేందుకు ఓ ఎస్సై కస్టమర్లో ఆ హోటల్కు వెళ్లాడు. ఓ రూ.500 నోటుపై సంతకం చేసి దానిని పట్టుకుని లోపలకు వెళ్లాడు. లోపల వ్యభిచారం (Sex racket) జరుగుతున్నట్టు తెలుసుకుని తన టీమ్కు సిగ్నల్ అందించాడు. మొత్తం ముఠాను పోలీసులు పట్టుకుని వేశ్యలను, హోటల్ మేనేజర్ను స్టేషన్కు తరలించారు (Crime News).
హిసార్లోని ఖేదర్ చౌక్లో ఉన్న మన్నాత్ హోటల్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ముందుగా రూ.500 నోటుపై సంతకం చేసి లోపలికి వెళ్లి దానిని హోటల్ మేనేజర్కు ఇచ్చాడు. అప్పుడు మేనేజర్ ఓ అమ్మాయిని అతడి గదిలోకి పంపించాడు. వెంటనే ఆ ఎస్సై తన టీమ్కు సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను పట్టుకున్నారు. నిందితులైన హోటల్ యజమాని సౌరభ్, అతని మేనేజర్ సోనును అరెస్ట్ చేశారు. పంజాబ్ రాజస్థాన్, హిమాచల్ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఈ వ్యాపారం చేస్తున్నట్టు బయటపెట్టారు.