పెట్రోల్ బంక్లో షాకింగ్ ఘటన.. బైక్లో రూ.300 పెట్రోల్ కొట్టించుకుని రూ.35 వేలు కొట్టేశాడు.. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో..
ABN , First Publish Date - 2023-02-06T16:28:34+05:30 IST
బీహార్లోని (Bihar) మోతీహరిలో 16 దోపిడీలకు పాల్పడిన కింగ్పిన్తో సహా ఐదుగురు దొంగలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా మోతీహరిలో ఇప్పటివరకు పలు రకాల దొంగతనాలకు పాల్పడి లక్షల్లో డబ్బు దోచుకున్నారు.
బీహార్లోని (Bihar) మోతీహరిలో 16 దోపిడీలకు పాల్పడిన కింగ్పిన్తో సహా ఐదుగురు దొంగలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా మోతీహరిలో ఇప్పటివరకు పలు రకాల దొంగతనాలకు పాల్పడి లక్షల్లో డబ్బు దోచుకున్నారు. శుక్రవారం రాత్రి పెట్రోల్ బంకు ఉద్యోగిని బెదిరించి రూ.35 వేలు దోచుకెళ్లారు (Robbery in Petrol Bunk). ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు వెంటనే స్పందించి వారందరినీ ఆదివారం పట్టుకున్నారు (Crime News).
ఈ దోపిడీ కేసుల్లో మాస్టర్ మైండ్ అయిన గుడ్డు సాహ్ని వరుస దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారాడు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సుగౌలి ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు గుడ్డు తన స్నేహితులతో కలిసి చేరుకున్నాడు. మొదట బైక్లో రూ.300 పెట్రోల్ పోయించాడు. ఆపై సహచరులతో కలిసి బంకు వ్యక్తిపై దాడి చేశాడు. ఆయుధాలు చూపించి బెదిరించి రూ.35 వేలు దోచుకున్నాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. పెట్రోల్ బంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
TamilNadu: ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నాడు.. హెల్మెట్ ధరించి ఆ భర్త చేసిన ఘోరమేంటంటే..
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. రాజా బజార్లో ఆ ముఠా ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి గుడ్డుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గుడ్డు సాహ్ని తన నేరాలను అంగీకరించాడు. గుడ్డు అందించిన సమాచారంతో ముఠాలోని మిగిలిన దొంగలను కూడా పోలీసులు పట్టుకున్నారు.