కిడ్నాప్‏నకు గురైన తల్లీకొడుకులు !

ABN , First Publish Date - 2023-01-26T10:34:03+05:30 IST

తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి పంచాయతీ యూనియన్‌ 1వ వార్డు కౌన్సిలర్‌ రోజా, ఆమె కుమారుడు జాకబ్‌ కిడ్నా్‌పకు గురయ్యారు.

కిడ్నాప్‏నకు గురైన తల్లీకొడుకులు !

గుమ్మిడిపూండి(చెన్నై), జనవరి 25: తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి పంచాయతీ యూనియన్‌ 1వ వార్డు కౌన్సిలర్‌ రోజా, ఆమె కుమారుడు జాకబ్‌ కిడ్నా్‌పకు గురయ్యారు. వారి కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తునట్లు జిల్లా ఎస్పీ సెభాష్‌ కల్యాణ్‌ ప్రకటించారు. వివరాలిలా.. పల్లవాడ గ్రామానికి చెందిన తెలుగు ప్రముఖుడు, అన్నాడీఎంకే మాజీ పంచాయతీ అధ్యక్షుడు రమేష్ కుమార్‌ (46) సతీమణ రోజా గుమ్మిడిపూండి పంచాయతీ యూనియన్‌ 1వ వార్డు కౌన్సిలర్‌గా వున్నారు. వారికి కుమార్తె జాయ్‌ (24), కుమారుడు జాకబ్‌ (22) వున్నారు. మంగళవారం సాయంత్రం బయటికెళ్లిన రమేష్ కుమార్‌ ఇంటికి ఫోన్‌ చేయగా ఎవ్వరూ లిఫ్ట్‌ చేయలేదు. ఇంటికొచ్చి చూడగా ఇంటిలో సీసీ కెమెరాలు ధ్వంసమైవున్నాయి. ఇంటి ముందు వుండాల్సిన కారు, రోజా, జాకబ్‌ అదృశ్యమైనట్లు గుర్తించి రమే్‌షకుమార్‌ పాదిరివేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-26T10:34:04+05:30 IST