విశాఖ ఉక్కు విలీనానికి అభ్యర్థనలు వచ్చాయి..
ABN , First Publish Date - 2023-02-07T02:38:36+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్ఐఎన్ఎల్, వైజాగ్ స్టీల్).. సెయిల్ లేదా ఎన్ఎండీసీల్లో విలీనం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు అందాయని ఉక్కు శాఖ...
ఉక్కు శాఖ సహాయ మంత్రి కులస్థే
న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని (ఆర్ఐఎన్ఎల్, వైజాగ్ స్టీల్).. సెయిల్ లేదా ఎన్ఎండీసీల్లో విలీనం చేయాలని కోరుతూ ప్రభుత్వానికి పలు అభ్యర్థనలు అందాయని ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫాగన్ సింగ్ కులస్థే తెలిపారు. రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చిన ఒక ప్రశ్నకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. పబ్లిక్ ఇష్యూతో పాటుగా హామీ రహిత రుణాల కోసం ప్రభుత్వ బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించే యోచన ఆర్ఐఎన్ఎల్కు లేదని కూడా ఆయన తెలిపారు. 70 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్ఐఎన్ఎల్లో వ్యూహాత్మక విక్రయాలు చేపట్టడానికి గాను లావాదేవీ విధానంపై ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.